Hosted by Dailymotion. For legal issues report at the Copyright Center, report us on DMC, or use the Instant Removal tool.
గవర్నర్ ఢిల్లీ ప్రయాణం...అర్థాంతరంగా రద్దు.
546 Views • Apr 26, 2018
Description
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఢిల్లీ పర్యటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటన కోసమని అక్కడకు బయలుదేరి వెళ్లిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఊహించని విధంగా తన పర్యటన రద్దు చేసుకొని తిరుగుముఖం పట్టారు. గవర్నర్ నరసింహన్ తన రెండు రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులను కలవాల్సిఉంది. ఈ మేరకు ఆయనకు వారందరితో అపాయింట్మెంట్లు సైతం ఖరారు చేసుకొని రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రాత్రికి ఢిల్లీకి చేరుకున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్...ఏం జరిగిందో ఏమో కానీ ఎవరినీ కలవకుండానే బుధవారం ఉదయాన్నే హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కావడం రాజకీయ వర్గాల్లో పెను ప్రకపంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ పర్యటన రద్దవడం, ఆయన వెంటనే హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
గవర్నర్ నరసింహన్ ఢిల్లీ ప్రయాణానికి ముందు మూడు రోజుల వ్యవధిలో తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ సమావేశాలు గంటల కొద్దీ సాగడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు తెలంగాణా సిఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు, మరోవైపు ఏపిలో విభజన హామీలపై చంద్రబాబు విన్నపాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు గవర్నర్ నరసింహన్ సంసిద్ధమై వెళ్లారని సమాచారం. అయితే గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్లడంతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయనపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించడం ఆరంభించారు.
గవర్నర్ నరసింహన్ గురించి చంద్రబాబు తాజాగా చేసిన ఆరోపణలు, విమర్శలు ఇవి...టిడిపికి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారనే వార్తలు పత్రికల్లో వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. గవర్నర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆ విధంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. అంతేకాదు...అసలు గవర్నర్ వ్యవస్థే వద్దని టీడీపీ గతంలోనే చెప్పిందని...ఆ అంశంపై పోరాటం కూడా చేశామని చెప్పారు. గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం పని చేసుకోవాలని, వార్తాపత్రికల్లో న్యూస్ వచ్చేలా గవర్నర్ వ్యవహరించడం మంచి పద్ధతి కాదని అన్నారు. తన గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల గురించి ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ ఆరా తీసారని, ఆ తరువాత అనూహ్యంగా ఆయన పర్యటన రద్దవడం గమనార్హమనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
Keywords & Tags
More from User
Madhapur Hailstorm Today | మాదాపూర్లో వడగండ్ల వాన బీభత్సం..! ఐటీ కారిడార్లో మంచు వర్షం | Oneindia
Oneindia Telugu
Lokanatha Prasad ACB Raids | పట్టుబడ్డ అక్రమాస్తులు ఎన్ని..? | Oneindia Telugu
Oneindia Telugu
Terror Alert in Vijayawada | ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల విచారణ.. పోలీసుల ఆపరేషన్ | Oneindia Telugu
Oneindia Telugu
Delimitation of Constituencies: తెలంగాణ, ఏపీలో పెరగనున్న లోక్ సభ స్థానాలు..! | Oneindia Telugu
Oneindia Telugu
Nirmala Sitharaman రైతులకు కేంద్రం షాక్! రుణమాఫీ చేసే ప్రసక్తే లేదు.. | Oneindia Telugu
Oneindia Telugu
AP Rain Alert Today | నేడు పిడుగులతో కూడిన భారీ వర్షాలు | Oneindia Telugu
Oneindia Telugu
Related Videos
Yadadri Will Develop as Telangana Tirupati : Governor Narasimhan - Oneindia Telugu
Oneindia Telugu
మన్యం జిల్లా: బయటికి వెళ్తున్నారా?... అయితే ప్రయాణం రద్దు చేసుకోండి..!
Oneindia Telugu
Andhra Pradesh : ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రోరోగ్
Oneindia Telugu
Women Applauds CM Revanth Reddy ఉచిత బస్సు ప్రయాణం పై ప్రశంసలు | Telangana | Telugu Oneindia
Oneindia Telugu
గవర్నర్తో కేసీఆర్,జగన్ భేటీ..!! || KCR & YS Jagan To Meet Governor Narasimhan || Oneindia Telugu
Oneindia Telugu
Governor Narasimhan performs puja at Khairatabad ganesh statue
Oneindia Telugu