⚖️
Legal Notice
Content hosted by Dailymotion. Report concerns at the Copyright Center.
జనసేన-వైసిపి ఒక్కటి అవుతాయా?
O
Oneindia Telugu
515 Views • Apr 16, 2018
Description
Telugudesam Party leader and Anantapur MP JC Diwakar Reddy interesting comments on Jana Sena chief Pawan Kalyan and YCP jagan.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలపాలని ఢిల్లీలో కొందరు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వారిద్దరిని కలపాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నప్పటికీ.. ఆ ఇద్దరు నేతలు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే ఢిల్లీ పెద్దలు చేసే ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కావని తేల్చి చెప్పారు. అయితే, తనకు పదవులపై ఆసక్తి లేదని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ.. ఆయన కూడా సీఎం పదవి కోరుకుంటున్నారని జేసీ చెప్పడం గమనార్హం.
ఏపీలో అవినీతి చోటు చేసుకుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల పైన విచారణ జరపాలని కొందరు అంటున్నారని, వారు ఏం అవినీతి చేశారో చెబితే విచారణ జరుపుతారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చంద్రబాబు నాయుడు పైన విచారణ జరిపారని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేశారు.కానీ ఏమీ చేయలేకపోయారని తెలిపారు. 2019 ఎన్నికలలో అవినీతిపరులు, సమర్థవంతంగా పని చేయని వారికి తమ పార్టీ నుంచి ఇక టిక్కెట్లు రావని తేల్చి చెప్పారు.
సరిగా పని చేయని వారికి టిక్కెట్లు నిరాకరించే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అలా టిక్కెట్లు రాని వారు చివరి నిమిషంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పారు. కాబట్టి చివరి నిమిషం వరకు వైసీపీ నిరీక్షించాల్సిందే అన్నారు.
వైసీపీ అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిలు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. అలాగే టీడీపీ నుంచి తమ పార్టీలోకి వస్తారని కొందరు చెబుతున్నారని, కానీ అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి ఎవరైనా ప్రతిపక్షంలోకి వెళ్తారా అని ప్రశ్నించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలపాలని ఢిల్లీలో కొందరు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వారిద్దరిని కలపాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నప్పటికీ.. ఆ ఇద్దరు నేతలు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే ఢిల్లీ పెద్దలు చేసే ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కావని తేల్చి చెప్పారు. అయితే, తనకు పదవులపై ఆసక్తి లేదని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ.. ఆయన కూడా సీఎం పదవి కోరుకుంటున్నారని జేసీ చెప్పడం గమనార్హం.
ఏపీలో అవినీతి చోటు చేసుకుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల పైన విచారణ జరపాలని కొందరు అంటున్నారని, వారు ఏం అవినీతి చేశారో చెబితే విచారణ జరుపుతారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చంద్రబాబు నాయుడు పైన విచారణ జరిపారని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేశారు.కానీ ఏమీ చేయలేకపోయారని తెలిపారు. 2019 ఎన్నికలలో అవినీతిపరులు, సమర్థవంతంగా పని చేయని వారికి తమ పార్టీ నుంచి ఇక టిక్కెట్లు రావని తేల్చి చెప్పారు.
సరిగా పని చేయని వారికి టిక్కెట్లు నిరాకరించే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అలా టిక్కెట్లు రాని వారు చివరి నిమిషంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పారు. కాబట్టి చివరి నిమిషం వరకు వైసీపీ నిరీక్షించాల్సిందే అన్నారు.
వైసీపీ అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిలు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. అలాగే టీడీపీ నుంచి తమ పార్టీలోకి వస్తారని కొందరు చెబుతున్నారని, కానీ అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి ఎవరైనా ప్రతిపక్షంలోకి వెళ్తారా అని ప్రశ్నించారు.
Keywords & Tags
More from User
Madhapur Hailstorm Today | మాదాపూర్లో వడగండ్ల వాన బీభత్సం..! ఐటీ కారిడార్లో మంచు వర్షం | Oneindia
Oneindia Telugu
Lokanatha Prasad ACB Raids | పట్టుబడ్డ అక్రమాస్తులు ఎన్ని..? | Oneindia Telugu
Oneindia Telugu
Terror Alert in Vijayawada | ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల విచారణ.. పోలీసుల ఆపరేషన్ | Oneindia Telugu
Oneindia Telugu
Delimitation of Constituencies: తెలంగాణ, ఏపీలో పెరగనున్న లోక్ సభ స్థానాలు..! | Oneindia Telugu
Oneindia Telugu
Nirmala Sitharaman రైతులకు కేంద్రం షాక్! రుణమాఫీ చేసే ప్రసక్తే లేదు.. | Oneindia Telugu
Oneindia Telugu
AP Rain Alert Today | నేడు పిడుగులతో కూడిన భారీ వర్షాలు | Oneindia Telugu
Oneindia Telugu
Related Videos
TDP Head Chandra Babu Naidu Warns Jagan Sarkar *Politics | Telugu OneIndia
Oneindia Telugu
YS Jagan: బూతులు మాట్లాడేవారినే YS Jagan ప్రోత్సహిస్తారు.. TDP నేతల ఫైర్ |Oneindia Telugu
Oneindia Telugu
YS Vivekananda Reddy కేసులో YS Jagan ని విచారించాలని TDP డిమాండ్| YSRCP | Oneindia Telugu
Oneindia Telugu
Ys Jagan దారిలో Ys Sharmila.. TDP కూటమి టార్గెట్ గా ఒక్కటైన ఇద్దరు | Oneindia Telugu
Oneindia Telugu
YS Jagan Delhi Tour : J. C. Diwakar Reddy Revealed Facts - Oneindia Telugu
Oneindia Telugu
టీడీపీ ,జనసేన కి Ys Jagan భయపడుతున్నాడు .. కారణం ఇదే | Telugu Oneindia
Oneindia Telugu